Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మోచా'' తుఫాను ముంచుకొస్తోంది.. జాగ్రత్త.. ఐఎండీ హెచ్చరిక

Webdunia
శనివారం, 6 మే 2023 (19:03 IST)
ఏపీ ప్రజలను మరో తుఫాను భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మోచాగా మారే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను, గమనం, తీవ్రత అనిశ్చితంగానే ఉన్నాయి. ఇది అధికారులలో ఆందోళన కలిగిస్తోంది. 
 
IMD యొక్క ట్విట్టర్ ఖాతా ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మే 8 నాటికి అల్ప పీడన ప్రాంతం (LPA) ఏర్పడుతుందని అంచనా వేయబడుతోంది. ఇది దాదాపు మే 9 నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 
 
ఈ తుఫాను కారణంగా చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని కోస్తా జిల్లాలకు అలర్ట్ జారీ చేయడంతో తమిళనాడు అప్రమత్తమైంది. 
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి, IMD రెండు తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా కోస్తా, రాయలసీమ జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రవాణా, పంటలపై తుఫాను ప్రభావం అధికంగా వుంటుందని తెలుస్తోంది. 
 
మోచా తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని.. అవసరమైన సామాగ్రిని నిల్వ చేసుకోవాలని, వారి ఇళ్లను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. రైతులు, గ్రామీణ సంఘాలు కూడా తమ జీవనోపాధి, ఆస్తులను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments