Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బుద్ధ పూర్ణిమ.. జాతినుద్దేశించి ప్రధాని ప్రత్యేక సందేశం

Webdunia
గురువారం, 7 మే 2020 (11:18 IST)
ప్రపంచవ్యాప్తంగా గురువారం బుద్ధ పూర్ణిమను ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా వైరస్ బాధితులు, కరోనా యోధులను ఉద్దేశించి ప్రస్తావించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధమత ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. బుద్ధుని జయంతి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలను 'వేసక్​'గా కూడా వ్యవహరిస్తారు.
 
బుద్ధ జయంతి సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, అంతర్జాతీయ బుద్ధిస్ట్ సమాఖ్య సంయుక్తంగా.. ఈ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ మత ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. 
 
బుద్ధుని జీవితంలో ముఖ్యస్థలాలుగా పేరుగాంచిన లుంబీనీ పార్క్ (నేపాల్), మహాబోధి ఆలయం(బోధ్​గయ, భారత్), ముల్గనంద కుటి విహారా.. సారనాథ్, పరినిర్వాణ స్తూప.. కుషినగర్, సహా శ్రీలంక, నేపాల్​లోని ఆయా ప్రాంతాల నుంచి లైవ్ కార్యక్రమాలు ప్రసారం చేయనున్నారు. 
 
వేసక్ బుద్ధ పూర్ణిమ వేడుకలను మూడు దీవెనల రోజుగా బౌద్ధమతంలో వ్యవహరిస్తారు. ఈ రోజే బుద్ధుని జననం, జ్ఞానోదయం, మహా పరినిర్వాణగా పిలిచే మరణం సంభవించాయని బౌద్ధుల విశ్వాసం. బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments