Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కిసాన్ పథకం.. ఈ-కేవైసీ ఆప్షన్‌ పునరుద్ధరణ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:55 IST)
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకంలో ఈ-కేవైసీ ఆప్షన్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పినట్లైంది. 
 
రైతులకు ఈ పథకంలో భాగంగా ఏటా 3 దఫాల్లో రూ.6 వేలను వారి ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. 11వ విడతలో భాగంగా పథకం సాయం పొందేందుకు గతంలో ఈ-కేవైసీ తప్పనిసరి అని చెప్పింది. ఆ తర్వాత ఈ-కేవైసీని తాత్కాలికంగా రద్దు చేసింది. 
 
ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించింది. ఇందులో భాగంగా పథకం నుంచి ప్రయోజనం పొందే రైతులు మే 31, 2022లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
 
ఈ-కేవైసీని పూర్తి చేసేందుకు రైతులు సీఎస్‌సీ(కామన్ సర్వీసు సెంటర్ల)కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. 
 
ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కేంద్రం సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments