ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు.. ప్రధాని ఆదేశం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:56 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇది ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని సురక్షితంగా మాతృదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటికే ఐదు విమానాల్లో అనేక మంది మాతృదేశానికి చేరుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఆపరేషన్ గంగను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని విషయాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిస్తున్నారు. 
 
వీరిలో హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్‌లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్ళనున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం దృష్టిసారించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments