Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక సింధ్ దేశం కోరుతూ నిరసనలు.. పాకిస్థాన్ నుంచి విముక్తి కావాలి

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:50 IST)
Sindhu
సింధీలకు ప్రత్యేక దేశం కోరుతూ నిరసనలు వెల్లువెత్తాయి. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కలిగించి స్వేచ్చను ప్రసాదించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ, ఇతర ప్రపంచ నేతలు జోక్యం చేసుకోవాలని నిరసనకారులు కోరారు. సింధ్‌లోని శాన్ నగరంలో ఈ ర్యాలీ ఆదివారం జరిగింది. 1967లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు. 
 
పాకిస్థాన్  ప్రభుత్వం, సైన్యం కారణంగా సింధ్ వాసులు ఎన్నో వేధింపుల బారిన పడుతున్నారని నిరసన కారులు పేర్కొన్నారు. బెలూచిస్థాన్ ప్రజలు కూడా దాదాపు ఇదేవిధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాష్ట్రం నుంచి అనేకమంది మేధావులు, కళాకారులు, విద్యావేత్తలు పాక్ కు భయపడి ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నారు.
 
తమ రాష్ట్రం ఇండస్-వ్యాలీ నాగరికతకు, వేదిక్ రిలిజిన్‌కి ప్రతీక అని, బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని 1947లో పాకిస్థాన్‌కు అప్పగించిందని ర్యాలీలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. సింధీలకు ప్రత్యేక దేశం.. సింధు దేశ్ ఇవ్వాలని నిరసనకారులు కోరుతున్నారు. 1967 లో జీఎం సయీద్, పీర్ అలీ మహమ్మద్ రషీద్ ఈ డిమాండును లేవనెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments