Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడనాడు మర్డర్.. పళనిసామికి ఊరట.. వేదనిలయం జప్తు

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (16:19 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లో అక్కడి గార్డ్ ఓమ్ బహదూర్ (40) అనుమానస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో పశనిస్వామికి సంబంధం వుందంటూ ఇటీవల ఓ మ్యాగజైన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఆధారంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఎస్టేట్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ కేసు విషయమై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. రామస్వామి వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఇదిలా ఉంటే దివంగత సీఎం జయలలిత పోయెస్ గార్డెన్‌ నివాసం వేద నిలయం జప్తులో వుంది. వేదనిలయంతో పాటు ఆమెకు చెందిన నాలుగు స్థిరాస్తులు ఆదాయం పన్ను శాఖ జప్తులో వున్నాయి. 
 
అన్నాశాలైలోని ఒక వాణిజ్య సదుపాయం, చెన్నై, సెయింట్ మేరీస్ రోడు లోని మరో ఆస్థి, హైదరాబాద్‌, శ్రీనగర్ కాలనీలో ఉన్న భవనం 2007 నుంచి తమ జప్తు కింద ఉన్నాయని  ఆదాయం పన్ను శాఖ న్యాయవాది ఎ.పి శ్రీనివాస్ కోర్టుకు పేర్కొన్నారు.
 
ఆదాయం పన్ను బకాయిలు కట్టనందుకు ఈ ఆస్తులను జప్తు చేయాల్సివచ్చిందని ఐటీశాఖ న్యాయవాది కోర్టుకు తెలిపారు. 1990-91 నుంచి 2011-12 ఆర్ధిక సంవత్సరాల వరకూ జయలలిత పన్ను బకాయిలు వడ్డీతో కలిపి రూ.10.12 కోట్ల వరకు వున్నాయని శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments