Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరో ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు... హైకోర్టు మెట్లక్కిన ప్రభాస్

Advertiesment
Rebel Star
, బుధవారం, 19 డిశెంబరు 2018 (16:28 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇంటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పైగాలోని వివాదాస్పద స్థలంలోని అర ఎకరంలో ప్రభాస్ ఓ గెస్ట్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఈ ఇల్లు ఉన్న స్థలం వివాదం గత 20 యేళ్లుగా రాయదుర్గం కోర్టులో సాగుతోంది. దీంతో రెండు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. అంతేకాకుండా, సర్వే నంబర్ 46లోగల రూ.1700 కోట్ల విలువ చేసే 84.30 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే తనకు నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేశారని ప్ర‌భాస్ పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించింది. అయితే, రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఈ కేసును కూడా పాత కేసు నడుస్తున్న డివిజన్ బెంచ్‌కే బదిలీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఫలితంగా మరో బెంచ్‌కు బదిలీ చేసింది. దీంతో దీనిపై పూర్తిస్థాయి విచారణ గురువారం జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21న వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్ : 'లక్ష్మీస్ ఎన్టీఆర్' డైరెక్టర్ వర్మ