Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (08:01 IST)
కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల రాక కోసం ఆగ్రా నగరంలోని హోటళ్లను శానిటైజ్ చేసి సిద్ధం చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల గత ఐదునెలలుగా తాజ్ మహల్‌ను మూసివేశారు. దీంతో ఆగ్రా నగరంలోని హోటళ్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్ర నష్టాల పాలయ్యారు. తాజ్ మహల్, ఆగ్రాకోటలను సందర్శకుల కోసం తెరవనున్నందున పర్యాటకులకు హోటల్ యజమానులు స్వాగతం చెప్పారు.

ఈ నెల 21 నుంచి  తాజ్ మహల్‌లో సందర్శకులను అనుమతించేందుకు ఆగ్రా జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగ్రా పర్యాటక రంగం ఊపందుకోనుంది. చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఇది నిజంగా శుభవార్తే.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments