Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాజ్‌మహల్‌ సందర్శన మళ్ళీ వాయిదా

తాజ్‌మహల్‌ సందర్శన మళ్ళీ వాయిదా
, సోమవారం, 6 జులై 2020 (10:31 IST)
తాజ్‌మహల్‌ సందర్శన మళ్ళీ వాయిదా పడింది. ఢిల్లీభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాకిడితో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందుల్లో అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆగ్రాలో తాజ్‌మహల్‌ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లోని సందర్శనీయ స్థలాలు మూసివేశారు. 

అనంతరం అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనా సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. అయితే, పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

ఈ ప్రకారం నేటి నుంచి తాజ్‌మహల్‌కు సందర్శనకు అనుమతి ఇద్దామని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవని ఆగ్రా జిల్లా యంత్రాంగం చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ నిరుద్యోగులూ! ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి..మీకే లాభం!