Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగా నదిలో మునిగిన బోటు... ఆరుగురు గల్లంతు!!

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (12:51 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. 17 మందితో వెళుతున్న పడవ ఒకటి గంగా నదిలో మునిగిపోయింది. బాధితుల్లో 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కానీ, మరో ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ విషాదకర ఘటన ఆదివారం ఉదయం జరిగింది. పాట్నాకు సమీపంలోని బాఢ్ గ్రామం గంగానది ఒడ్డున ఉంది. గంగా దసరా పండుగ సందర్భంగా ఆదివారం పెద్ద సంఖ్యలో స్థానికులు నదీ తీరానికి వచ్చారు. నదీ స్నానం చేసి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ ఎక్కారు. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ మునిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడగా, 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలినవారు నీళ్లలో మునిగిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. 
 
ఈ ప్రమాదం సమయంలో పడవలో మొత్తం 17 మంది ఉన్నారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలు నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరు.. నదిలో మునిగిపోయిన పడవలో సామర్థ్యానికి మించి అంటే దాదాపు 25 మంది వరకు ఉంటారని, ఈ కారణంగానే పడవ మునిగిపోయివుంటుందని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా గుర్తించలేకపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments