Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేసిన జగన్ వీరవిధేయుడు కరికాల వలవన్

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (12:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ రాజీనామా చేశారు. ఆయనను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. జగన్‌ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించారని వలవన్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వలవన్ రాజీనామా చేశారు. 
 
ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన అధికారులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో కరికాల వలవన్ ఒకరు. నిజానికి ఆయన పదవీకాలం గతంలోనే ముగిసింది. కానీ, ఉద్యోగ విరమణ తర్వాత కూడా గత ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారులను కొనసాగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేస్తూ వచ్చింది. 
 
అలాంటి వారిలో ఈయన ఒకరు. ఇందుకోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వలవన్ మరో నెల రోజుల పాటు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో వలవన్ రాజీనామా చేశారు. తన పదవీకాలం పొడగించిన జగన్ ప్రభుత్వానికి వలవన్ పూర్తి స్థాయిలో సహకరించారని, జగన్‌కు అనుకూలంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments