Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాష్ట్రపత్ని' పై లోక్‌సభలో రగడం - ముగ్గురు ఎంపీల సస్పెన్షన్

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:18 IST)
కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని రాష్ట్రపత్నిగా సంభోదించారు. ఈ వ్యాఖ్యలు ఉభయ సభల్లో పెను దుమారాన్ని రేపాయి. 
 
రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. 
 
దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ మొదటి నుంచి అవమానిస్తోందని ఆరోపించారు. 'దేశంలో గిరిజనులందరినీ అవమానించారు'. 
 
గురువారం లోక్​​సభ ప్రారంభం కాగానే.. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కౌంటరిచ్చారు. ఇప్పటికే అధీర్‌.. క్షమాపణలు చెప్పారన్నారు. 
 
అదేవిధంగా ముర్ముపై  అధీర్​ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుని ఛైర్మన్​ వెల్​లోకి దూసుకెళ్లారు. ఆ చర్యను రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఆందోళనలు చేపడుతున్న ఎంపీలు సభ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. కానీ ఏ ఎంపీ పేరును ఆయన చెప్పలేదు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments