Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉభయ సభల్లో విపక్షాల ఆందోళను - కొనసాగుతున్న వాయిదాలపర్వం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (15:39 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళన ఏమాత్రం ఆగడం లేదు. కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని, పెగాసస్ స్పై వేర్‌పై విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులంతా ఇరు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలను స్పీకర్లు వాయిదావేశారు. 
 
ముఖ్యంగా పెగాసస్‌పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. 
 
మరోవైపు, విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ సైతం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. యుద్ధవీరులకు నివాళి వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు తెలిపాయి. 
 
దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు. మీరాబాయికి అభినందనలు అదేసమయంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 
 
21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments