Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన మనికా పోరాటం

టోక్యో ఒలింపిక్స్‌లో ముగిసిన మనికా పోరాటం
, సోమవారం, 26 జులై 2021 (14:54 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భాగంగా, టేబుల్ టెన్నిస్ విభాగంలో రెండు రౌండ్లు దాటి సంచ‌ల‌నం సృష్టించిన భారత క్రీడాకారిణి మ‌నికా బాత్రా పోరాటం మూడో రౌండ్‌లో ముగిసింది. ఆస్ట్రియా క్రీడాకారిణి సోఫియా పోల్క‌నోవా చేతిలో ఆమె 0-4తో దారుణంగా ఓడిపోయింది. 
 
ప్ర‌త్య‌ర్థి దూకుడైన ఆట ముందు మ‌నికా నిల‌వ‌లేక‌పోయింది. పోల్క‌నోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. 30 నిమిషాలలోపే ఈ మ్యాచ్ ముగియ‌డం విశేషం. 
 
ఇదిలావుంటే, ప్రపంచ ఛాంపియన్ మెక్ మేరీ కోమ్ 51 కిలోల విభాగం మహిళల బాక్సింగులో ఆదివారం అరగొట్టారు. విజయంతో టోక్యో ఒలింపిక్స్‌ను ప్రారంభించింది. ఆదివారం డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4–1 తేడాతో మట్టి కరిపించింది. 
 
ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ప్రి క్వార్టర్స్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను మేరీకోమ్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్ గ్రామంలో కరోనా కలకలం.. 16మంది క్రీడాకారులకు పాజిటివ్