Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ట్రయల్స్‌కు భారత్‌లో అనుమతి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (20:48 IST)
ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డిసిజిఐ) అనుమతినిచ్చింది. 
 
ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన తొలి, రెండు దశ ఫలితాలను విశ్లేషించిన అనంతరం భారత్‌లో దీన్ని పరీక్షించేందుకు అనుమతించాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ అర్గనైజేషన్‌ లోని నిపుణుల కమిటీ డిసిజిఐకి సిఫార్సు చేసింది. దీంతో కొవిషీల్డ్‌ పేరిట తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రయోగించేందుకు అనుమతి లభించింది.

దేశవ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనున్నట్లు సిఐఐ వర్గాలు తెలిపాయి. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్‌ కాలేజీ కూడా ఉంది. 18 ఏళ్ల వయస్సు పైబడిన 1600 మందికి ఈ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యాక్సిన్‌ను మొత్తం రెండు డోసుల్లో ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తొలిడోసు ఇచ్చిన 29 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments