Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిన్న చైనా.. ఇప్పుడు భారత్,రష్యాలపై దుమ్మెత్తి పోసిన ట్రంప్

Advertiesment
నిన్న చైనా.. ఇప్పుడు భారత్,రష్యాలపై దుమ్మెత్తి పోసిన ట్రంప్
, శుక్రవారం, 31 జులై 2020 (07:48 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతే.. ఆయన మారరుగాక మారరు. ఆ దేశంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు చైనాపై చిందులేసిన ఆయన.. ఇప్పుడు రష్యా, భారత్ పైనా దుమ్మెత్తి పోస్తున్నారు.
 
భారత్‌, చైనా, రష్యాలు వెలువరించే కర్బన ఉద్గారాల గురించి ఎలాంటి రక్షణ తీసుకోలేదని నిందించారు. అమెరికా చేసినంత కూడా ఈ దేశాలు చేయలేదని, పైగా లెక్కలేనన్ని పరిమితులు విధిస్తారని, అందుకే పారిస్‌ వాతావారణ ఒప్పందం నుంచి తాము వైదొలిగామని ట్రంప్‌ చెప్పారు.

టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే డెమొక్రాట్లపై విమర్శలు కూడా చేశారు. ఈ పిచ్చి డెమోక్రాట్లు లెక్కలేనన్ని అమెరికా ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలను చైనాకు తరలిస్తారని విమర్శించారు.

'మన గాలి గురించి మనం శ్రద్ధ తీసుకోవాలని వారు కోరుకుంటారు. కానీ చైనా తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. భారత్‌ తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. రష్యా కూడా శ్రద్ధ తీసుకోదు. కానీ, మనం చేయాలి' అని ట్రంప్‌ అన్నారు. తాను అధికారంలోకి ఉన్నంత వరకూ అమెరికాను అగ్రస్థానంలో ఉంచుతానని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాట్ ఎంట్రన్స్ కు ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు