Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్.. 329మంది మృతి.. రోజుకు 20మంది..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:35 IST)
కరోనా సెకండ్ వేవ్ వైద్యులను బలితీసుకుంటోంది. రెండో దశలో ఇది ఏకంగా 329 మంది వైద్యుల ప్రాణాలను హరించినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. వీరిలో దాదాపు 80 మంది ఒక్క బీహార్‌కు చెందినవారేనని పేర్కొంది. ఢిల్లీలో 73 మంది మరణించారని తెలిపింది. కరోనా బారినపడి ఉత్తరప్రదేశ్‌లో 41 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వివరించింది.
 
ప్రమాదకరమైన ఈ మహమ్మారి బారినపడి రోజుకు సగటున 20 మంది వైద్యులు కన్నుమూస్తున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మృతి చెందిన వారిలో ప్రభుత్వ, ప్రైవేటు, మెడికల్ ఆసుపత్రులలోని వైద్యులు ఉన్నట్టు ఐఎంఏ వివరించింది. 
 
గత రెండు నెలల్లో 270 మంది వైద్యులు రెండో వేవ్ కారణంగా మరణించారని మంగళవారం ఐఎంఏ తెలిపింది. ఇప్పుడీ సంఖ్య 300 దాటింది. ఇక తొలి వేవ్‌లో గతేడాది 748 మంది వైద్యులు కరోనాతో మరణించారని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments