కరోనా సోకిన వ్యక్తి మృతి.. ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టిన బంధువులు

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:57 IST)
Fire
కరోనా సోకిన వ్యక్తి.. త్వరలో ఆ రోగం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని అనుకున్నాడు. కానీ ఇంతలో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి అతని బంధువులు తరలించారు. అక్కడ కరోనా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్‌కు నిప్పు పెట్టారు. అది పూర్తిగా కాలిపోయింది.
 
అంతటితో ఆగకుండా ఆస్పత్రిపై రాళ్ల దాడి చేశారు. రోగి చనిపోయినప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసేందుకు కూడా వారు యత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,764 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 55 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments