Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిన వ్యక్తి మృతి.. ఆంబులెన్స్‌కు నిప్పు పెట్టిన బంధువులు

Webdunia
గురువారం, 23 జులై 2020 (12:57 IST)
Fire
కరోనా సోకిన వ్యక్తి.. త్వరలో ఆ రోగం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని అనుకున్నాడు. కానీ ఇంతలో ప్రాణాలు కోల్పోయాడు. కరోనా సోకిన ఓ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక బెళగావిలోని బీమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
 
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని బీమ్స్ ఆస్పత్రికి అతని బంధువులు తరలించారు. అక్కడ కరోనా బాధితుడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్‌కు నిప్పు పెట్టారు. అది పూర్తిగా కాలిపోయింది.
 
అంతటితో ఆగకుండా ఆస్పత్రిపై రాళ్ల దాడి చేశారు. రోగి చనిపోయినప్పుడు ఐసీయూలో ఉన్న డాక్టర్‌పై దాడి చేసేందుకు కూడా వారు యత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,764 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 55 మంది మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments