Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్‌ 30 వరకు ఆదాయపు పన్ను రిటర్నులకు అవకాశం

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:27 IST)
ఆదాయపన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. చెల్లింపులకు మరికొంత గడువు ఇచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్‌) సమర్పించేందుకు చివరి తేదీని సెప్టెంబర్‌ 30గా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సిబిడిటి) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31 వరకు గతంలో పెంచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. 2019-20 ఆర్థిక సంత్సర రిటర్నులు సమర్పించేందుకు గడువును పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్‌ 30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ గడువును జులై 31కి పొడిగించింది. ఇప్పుడు మళ్లీ సెప్టెంబర్ 30వరకు పొడిగించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments