Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాఫెల్ యుద్ధ విమానాలు భారతగడ్డను ముద్దాడితే... పొరుగు దేశాల్లో ప్రకంపనలు

Advertiesment
Manoj Tiwari
, గురువారం, 30 జులై 2020 (15:09 IST)
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా తొలి దశలో ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగుపెట్టాయి. ఈ డీల్‌లో భాగంగా మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా నేడు ఐదు విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఐదు విమానాలు బుధవారం మధ్యాహ్నం భారత గడ్డను ముద్దాడాయి. దీంతో యావత్ భారత్ పులకించిపోయింది. 
 
దీనిపై భారత క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కారంతో కూడిన ఓ ట్వీట్ చేశారు. భారత్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టిన వెంటనే పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించిందంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ రాకతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటగా తాజాగా మనోజ్ తివారీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 
 
రాఫెల్ విమానాలు భారత్‌లో ల్యాండ్ అయిన వెంటనే పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయన్నారు. ఈ విమానాల రాకతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరిగిందని, ఇకపై పొరుగు దేశాల నుంచి రెచ్చగొట్టడాలు ఉండవని పేర్కొన్నాడు.
 
అంబాలాలో ఇవి ల్యాండ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా అంబాలా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా మిగతా విమానాల్లో మరికొన్ని ఆగస్టులో రానున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్.. ఆదివారం నో పర్మిషన్