Webdunia - Bharat's app for daily news and videos

Install App

#OperationKashmir ఉద్రిక్తత - అమర్నాథ్ యాత్ర రద్దు - భారీగా బలగాలు

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (11:45 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్తవాతాణం నెలకొంది. శనివారం ఉదయం శ్రీనగర్‌లో ఓ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. పైగా, కాశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఐదుగురు జైషే మొహ్మద్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పైగా, జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను కేంద్రం తరలిస్తోంది. అలాగే, అమర్నాథ్ యాత్రపై దాడి చేసే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు రావడంతో ఈ యాత్రను కూడా కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా రద్దు చేసింది. అలాగే, శ్రీనగర్‌లోని ఎన్.ఐ.టికి నిరవధిక సెలవులను యాజమాన్యం ప్రకటించింది. 
 
హిందువులు ఎంతో పవిత్రంగా భావించి చేపట్టే అమర్నాథ్ యాత్రపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర ముష్కరులు గురిపెట్టి అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు, మారణాయుధాలు పెట్టినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో యాత్రను కుదించుకుని, 'వెంటనే' కాశ్మీరును విడిచి స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని యాత్రికులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. 
 
అలాగే, సెలవులో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీలైనంత త్వరగా విధులకు హాజరు కావాలని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆదేశించారు. పాకిస్థానీ ఉగ్రవాదులు అమర్నాథ్‌ యాత్రపై దాడులకు కుట్ర పన్నిన నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ అప్రమత్తం అయింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది. బలగాల తరలింపునకు కేంద్రం తొలిసారి యుద్ధ విమానాలను, హెలికాఫ్టర్లను వినియోగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments