Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి కొరత : నాసిక్ జిల్లాలో వేలం నిలిపివేత

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:59 IST)
దేశంలో ఉల్లి కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో దీని ఎగుమతులపై 40 శాతం పన్ను విధించింది. దీన్ని వ్యాపారులు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి మార్కెట్లలో వేలం నిలిపివేశారు. ఈ జిల్లాలోని లాసల్‌గావ్ మార్కెట్ భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్.
 
కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల నేపథ్యంలో ఉల్లి వ్యాపారులు సమ్మెను వాయిదా వేశారు. ఈ పరిస్థితిలో తమ డిమాండ్ ఇంతవరకు నెరవేరలేదని నిరసిస్తూ నిన్నగాక మొన్న నాసిక్ జిల్లా మార్కెట్లలో ఉల్లి వేలాన్ని మళ్లీ నిలిపివేశారు. ఈ నిరసన గురువారం రెండో రోజు కొనసాగింది. దీంతో రైతులు వేలానికి తెచ్చిన ఉల్లి బస్తాలు మార్కెట్లలోనే ఉండిపోయాయి.
 
వ్యాపారుల సమ్మె కారణంగా ఉల్లి సరఫరా నిలిచిపోయి చిల్లర దుకాణాల్లో ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నాసిక్‌లోని సహకార సంఘాల రిజిస్ట్రార్ అన్ని వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలకు (ఏపీఎంసీ) ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెలో పాల్గొన్న వ్యాపారుల లైసెన్సులు రద్దు చేస్తామని, లేదంటే సస్పెండ్ చేస్తామని అందులో హెచ్చరించారు. 
 
ఈ విషయమై నాసిక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ.. 20వ తేదీన జరిగిన చర్చల్లో వ్యాపారులు, దళారులు మొండిచేయి చూపారని, దీని వల్ల తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments