Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ముగ్గురు మహిళలపై అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి..?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:52 IST)
హర్యానాలోని పానిపట్‌లో నలుగురు సభ్యుల ముఠా అకస్మాత్తుగా ఆయుధాలు, కత్తులు, పదునైన బ్లేడ్లతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోకి ప్రవేశించిన ముఠా మహిళలు తప్ప మిగతా కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి.. శబ్దం చేస్తే చంపేస్తామని బెదిరించారు. 
 
దీంతో భయాందోళనకు గురైన వారు శబ్దం చేయలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగలు, డబ్బు దోచుకెళ్లిన ముఠా పారిపోయింది. 
 
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మరోచోట కూడా దోపిడీ జరిగింది. భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముఠా.. భర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఆరోగ్యం బాగాలేని భార్య భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో యువతిపై గుంపు దాడి చేసింది. 
 
గాయపడిన మహిళ మృతి చెందింది. అలాగే కిడ్నాప్‌కు గురైన భర్త నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరగడంతో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments