Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానాలో ముగ్గురు మహిళలపై అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి..?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:52 IST)
హర్యానాలోని పానిపట్‌లో నలుగురు సభ్యుల ముఠా అకస్మాత్తుగా ఆయుధాలు, కత్తులు, పదునైన బ్లేడ్లతో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లోకి ప్రవేశించిన ముఠా మహిళలు తప్ప మిగతా కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి.. శబ్దం చేస్తే చంపేస్తామని బెదిరించారు. 
 
దీంతో భయాందోళనకు గురైన వారు శబ్దం చేయలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగలు, డబ్బు దోచుకెళ్లిన ముఠా పారిపోయింది. 
 
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే మరోచోట కూడా దోపిడీ జరిగింది. భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోకి చొరబడిన ముఠా.. భర్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. ఆరోగ్యం బాగాలేని భార్య భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో యువతిపై గుంపు దాడి చేసింది. 
 
గాయపడిన మహిళ మృతి చెందింది. అలాగే కిడ్నాప్‌కు గురైన భర్త నుంచి డబ్బు, మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనల్లోనూ ఒకే ముఠా హస్తం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ రెండు ఘటనలు ఒకే గ్రామంలో జరగడంతో నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments