వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:52 IST)
ఒకే దేశం - ఒకే ఎన్నిక (వన్ నేషన్ - వన్ ఎలక్షన్)పై కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లును తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. ఇంతలోనే కేంద్రం వెనక్కి తగ్గింది. 
 
లోక్‌సభ సోమవారం బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. ఈ మేరకు అప్డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది.
 
కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
 
ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. డిసెంబరు 20తో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. సోమవారాన్ని మినహాయిస్తే మరో నాలుగు రోజులే మిగిలి ఉంటాయి. మరి ఈ సెషన్‌లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా... లేదా? అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments