Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరజీవి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాము నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లా మార్చామని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. 
 
నాటు పొట్టి శ్రీరాములు బలిదానంతోనే రాష్ట్రంలో భాషా సంయుక్త రాష్ట్రాల అవతరణకు బీజం పడిందని చెప్పారు. ఆ మహనీయుడ ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం అవతరించిందన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మత్తం నింపాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments