మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (16:31 IST)
మనిషి మర్చిపోవడం సహజమని, కానీ, ఎవరైతే అన్నం పెట్టారో, నిలబడ్డారో, పని చేసారో వారిని కూడా మర్చిపోతాం మనం. కానీ వారిని గుర్తుంచుకోవడం చాలా అవసరం. మనం ఎవరి నుండి వచ్చామో గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసిన పవన్ కల్యాణ్ ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఒక జాతికి, ఒక కులానికి నాయకుడు కాదని... ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు అని కీర్తించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించాలంటే ఆర్య వైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండానే ఆయనను గౌరవించుకునేలా ఉండాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు.
 
'మనిషికి మరపు సహజం. మనకు అన్నం పెట్టినవారిని, మనకు తోడుగా నిలిచిన వారిని, మనకు అండగా నిలబడిన వారిని మర్చిపోతారు... కానీ అలాంటి వారిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. మనం ఎక్కడినుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం విలువ ఏంటో అర్థమైంది.
 
పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు కఠోర ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం సాకారమయ్యేలా చేశారు. కానీ పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం తర్వాత ఆయన భౌతికకాయాన్ని మోయడానికి నలుగురు కూడా లేని పరిస్థితి బాధాకరం. ఘంటసాల వంటి మహానుభావులు కొంతమంది ఆ రోజు ముందుకొచ్చారు.
 
ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం ప్రతి తరానికి గుర్తుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాకు క్యాబినెట్ సమావేశంలో చెప్పారు. ఆ మహనీయుడి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ పవన్ పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments