Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వరుడి తండ్రితో వధువు తల్లి పరార్‌

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (08:05 IST)
అవును.. వాళ్లిద్దరూ లేచిపోయారు. తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మాటల్లోకి దిగిన ఆ జంట.. విరహం తాపలేక లేచిపోయారు. వియ్యమందుకోవాల్సిన ఆ జంట.. పడక పంచుకున్నారు. ఇలా జరిగింది ఒక్కసారి కాదు.. ఇది రెండో సారి.
 
గుజరాత్‌లో జనవరి నెలలో తమ పిల్లల పెళ్లి సంబరాలకు ముందు ‘లేచిపోయిన’ ఓ వధువు తల్లి, వరుడి తండ్రి మళ్లీ అదే పనిచేశారు. సూరత్‌కు చెందిన హిమ్మత్‌ పాండవ్‌(46), నవ్‌సారీకి చెందిన శోభనా రావల్‌ పరస్పరం ఆకర్షితులై లేచిపోవడంతో పిల్లల పెళ్లి నిలిచిపోయింది.

అయితే కుటుంబ, సమాజ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల క్రితం తిరిగి వచ్చినా ఒకర్నొకరు విడిచి ఉండలేకపోయారు. మూడ్రోజుల క్రితం ఇద్దరూ మళ్లీ లేచిపోయారు. సూరత్‌లోనే ఓ ఇంట్లో సహజీవనం మొదలెట్టేశారు.

తొలిసారి వెళ్లిపోయినప్పుడు వారిరువురిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఈసారి మాత్రం ఏ కేసూ నమోదు చేయలేదు.

తిరిగివచ్చిన తరువాత శోభనను ఆమె భర్త ఇంట్లో అడుగుపెట్టనివ్వకపోవడంతో ఆమె తన తలిదండ్రుల ఇంట్లో ఉండిపోయింది.

లేచిపోయిన ఇద్దరూ చిన్ననాటి నుంచీ మంచి స్నేహితులు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా పెద్దలు వద్దనడంతో ఏం చేయలేకపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments