Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్డీకొట్టు మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (08:43 IST)
దేశరాజధాని ఢిల్లీ నగరంలో కూరగాయల బండి (బడ్డీకొట్టు) పెట్టుకొని జీవించే ఒక మహిళను గొంతుకోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం ద్వారకా ప్రాంతంలో జరిగింది. తొలుత సదరు మహిళ వద్దకు రావడానికి నిందితుడు ప్రయత్నించాడు. దీంతో చీపురు చూపించి ఆ మహిళ అతన్ని బెదిరించింది.
 
ఆ తర్వాత తన చేతిలోని సంచిని కింద పెట్టిన నిందితుడు దీపక్.. సంచిలో నుంచి కత్తి తీసి మహిళపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి పరారయ్యే ప్రయత్నం చేశాడు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
అయితే అక్కడకు వెళ్లే సరికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలిని విభ (30)గా గుర్తించారు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చావబాదారు. తాగిన మైకంలో విభ, ఆమె భర్తతో అతను గొడవపడ్డాడని, ఆ కోపంతోనే ఇంత దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు.
 
సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు... నిందితుడి కోసం వెళ్లగా పోలీసులను కూడా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని కాపాడిన పోలీసులు స్థానికంగా ఉన్న దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విధులను అడ్డుకున్నందుకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments