Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయి ధరమ్ తేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడానుః శ్రీ‌కాంత్‌

సాయి ధరమ్ తేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడానుః శ్రీ‌కాంత్‌
, గురువారం, 30 సెప్టెంబరు 2021 (16:50 IST)
Srikanth- Sai tej
సాయి ధరమ్ తేజ్ చాలా మంచివాడు. మేమంతా కలిసి క్రికెట్  ఆడేవాళ్లం. విదేశాల్లో టూర్లు కూడా వేశాం. త‌ను బైక్ ప్ర‌మాదం బారిన ప‌డ‌డం దుర‌దృష్ట‌క‌రం. బైక్ ప్రమాదాలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. సాయి ధరమ్ తేజ్ ఆసుప‌త్రిలో క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన చిత్రం `రిపబ్లిక్` పెద్ద హిట్ కావాలి. మంచి బూస్టప్ ఇవ్వాలి అంటూ హీరో శ్రీ‌కాంత్ చెప్పారు.
 
బైక్ రైడింగ్ గురించి చెబుతూ, నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది అని చెప్పారు. ఆయ‌న న‌టించిన `ఇదే మా కథ’  సినిమా కూడా బైక్ రైడింగ్ నేప‌థ్యంలో సాగుతంది. ఇందులో నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్లీ చాప్లిన్ లుక్ లో మెరిసిన నభా నటేష్