భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు...

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:54 IST)
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ కిరాతక భర్త.. అన్నెంపున్నెం ఎరుగని శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు. ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వర్‌లో జరిగింది. 
 
దీనిపై జిల్లా ఎస్పీ సాగరిక నాథ్ స్పందిస్తూ, చందన్‌కు తన్మయి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి మే 9వ తేదీన ఆడపిల్ల పుట్టింది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందువల్లే గర్భం దాల్చిందన్న అనుమానంతో చందన్‌ రగిలిపోయాడు. ప్రసవమైన రెండు వారాలకు స్థానిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తన్మయి పుట్టింటికి వెళ్లింది. 
 
భార్యాబిడ్డలను చూసే నెపంతో సోమవారం అక్కడకు చేరుకొన్న చందన్‌.. భార్య మరో గదిలో ఉన్న సమయంలో చిన్నారి శరీరంలోకి సిరంజి ద్వారా పురుగుల మందు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. శిశువు ఏడుపు విన్న తన్మయి భర్తను నిలదీయగా బుకాయించాడు. వెంటనే పాపను బాలేశ్వర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సాగరిక నాథ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments