Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక రాంగ్ ఫోన్ కాల్.. ఇద్దరి ప్రాణాలు తీసింది.. ఎలా?

Webdunia
బుధవారం, 31 మే 2023 (10:31 IST)
ఒక రాంగ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే యువకుడు ఇటీవల మృతి చెందాడు. దీనిపై పోలీసులు ఆరా తీయగా కొత్త కోణాలు వెలుగు చూశాయి. ఆరు నెలల క్రితం సుజాత అనే టీచర్ ఫోన్ నుంచి రాజేశ్‌కు ఓ రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ప్రారంభమైంది. సుజాత్ ఫోన్ డీపీ చూసిన రాజేశ్‌.. సుజాతకు పెళ్లి కాలేదని భావించి, ఆమెను ప్రేమించసాగాడు. పైగా, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాట్సాప్ మెసేజ్ సందేశాలు, ఫోన్ సంభాషణలు బాగానే జరిగాయి. 
 
నిజానికి టీచర్ సుజాతకు వివాహమై ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టిన సుజాత... రాజేశ్‌‍తో కలిసి అనేక ప్రాంతాల్లో విహరించింది. వారిద్దరూ కలిసి పలుమార్లు ఏకాంతంగా కలుసుకున్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సుజాతకు వివాహం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆమెపై రాజేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను దూరం పెట్టసాగాడు. రాజేశ్ తనను దూరం పెట్టడాన్ని సుజాత జీర్ణించుకోలేక పోయింది. అయితే, ఓ సారి కలుద్దాం రమ్మంటూ సుజాత అతనికి మెసేజ్ పెట్టింది. రాజేశ్ స్పందించకపోవడంతో తాను చనిపోతానని బెదిరించింది. నువ్వు చనిపోతే తాను కూడా చనిపోతానంటూ రాజేశ్ రిప్లై ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో సుజాతను కలుసుకునేందుకు రాజేశ్ హయత్ నగర్‌కు వచ్చాడు. అప్పటికే సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పైగా, ఈ విషయం సుజాత కుమారుడు, కుమార్తెకు తెలిసింది. రాజేశ్ రాగానే సుజాత కుమారుడు మరో ముగ్గురితో కలిసి దాడి చేశాడు. ఆ తర్వాత రాజేశ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం.. దాడి చేయడం వల్లే రాజేశ్ చనిపోయివుంటాడన్న కోణంలో విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మొత్తంమీద ఓ మిస్డ్ ఫోన్ కాల్ ఇద్దరి ప్రాణాలు తీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments