Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు షాక్ - స్వయంగా కోర్టుకు రావాల్సిందే..

Advertiesment
jagan
, శుక్రవారం, 13 జనవరి 2023 (15:24 IST)
కోడికత్తి కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కోడికత్తి శ్రీనివాస్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, కోర్టు టేప్ రికార్డర్‌గా ఉండదని వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్.ఐ.ఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని ప్రశ్నించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 
 
ఈ కేసులో 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వరకు ఉన్నవారి స్టేట్మెంట్లు, చార్జిషీట్‌లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్జి స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో ప్రేయసికి ప్రపోజ్ చేసిన వ్యక్తి.. వీడియో వైరల్