Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ - తీరు మార్చుకోకుంటే కొత్తవారికి ఛాన్స్...

jagan
, శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:38 IST)
వైకాపాకు చెందిన శాసనసభ్యులకు శుక్రవారం వర్క్ షాపు నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వర్క్ షాపుకు ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహించారు. ఇందులో ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఇందులో 32 మంది ఎమ్మెల్యేలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ హెచ్చరించారు. 
 
ముఖ్యంగా వచ్చే 100 రోజులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో పాటు పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, పని తీరును మార్చుకోని పక్షంలో వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. పైగా, కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతానని చెప్పారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఎవరినీ మార్చే ఉద్దేశ్యం తనకు లేదనీ, కానీ ఆ పరిస్థితిని మీరే తెచ్చుకోవద్దని కోరారు.
webdunia
 
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పది రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమితాబ్ బచ్చన్‌కు "భారత్ రత్న" ఇవ్వాలి : మమతా బెనర్జీ