Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్ - పాన్ కార్డు అనుసంధానానికి తుది గడువు ఇదే...

pan card - aadhaar card
, ఆదివారం, 20 నవంబరు 2022 (10:17 IST)
పాన్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత ఆధార్‌ కార్డుతో పాన్ కార్డును లింకు చేయడం సాధ్యంకాదని ఐటీ శాఖ హెచ్చరిస్తుంది. 
 
నిజానికి ఈ రెండు నంబర్ల అనుసంధానానికి ఇప్పటికే పలుమార్లు ఆదాయపన్ను శాఖ గడువు ఇచ్చింది. పలు మార్లు పొడగించింది కూడా. ఈ నేపథ్యంలో మరోమారు గడవు పొడగించే ప్రసక్తే లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల 2023 మార్చి 31వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని తెలిపింది. 
 
ఈ యేడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఆదాయపన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింకు కోసం రూ.వెయ్యి చొప్పున సూలు చేస్తుంది. వచ్చే యేడాది మార్చి వరకు రూ.వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింకు చేసుకోవచ్చని చెబుతోంది. 
 
ఈ రెండు నంబర్లను మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చు. 
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి క్విక్ లింక్ విభాగంలో లింక్ ఆధారం ఎంపికై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబరును, ఆధార్ నంబరును, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
 
పాన్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీని ఎంటర్ చేయాలి. వాలిడేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రూ.వెయ్యి అపరాధం చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చనిపోయిన ప్రియురాలిని పెళ్లాడిన ప్రేమికుడు.. ఎక్కడ?