Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే.. ఠాణాలో ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (09:09 IST)
ఒడిషా రాష్ట్రంలో బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశారు. దీనిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జగత్సింగ్‌పూర్‌ జిల్లా తిర్తోల్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు(బీజేడీ) విజయ్‌శంకర్‌ దాస్‌పై సోనాలిక అనే యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసగించాడని ఆరోపించారు. 
 
ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లికి అంగీకరించారని, పెళ్లి చేసుకునేందుకు జగత్సింగ్‌పూర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మే 17న దరఖాస్తు చేసుకోగా, అధికారులు శుక్రవారం స్లాట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
తాను కార్యాలయానికి వెళ్లినా, ఎమ్మెల్యే రాకపోవడంతో రెండుగంటల పాటు నిరీక్షించి, వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో మోసగించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments