Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సరిబేసి విధానం : బీజేపీ నేతకు ఫైన్ - సైకిల్‌పై ఉపముఖ్యమంత్రి

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (15:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపైకి వచ్చే వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ, బీజేపీ నేత విజయ్ గోయల్ మాత్రం ఈ విధానాన్ని తప్పుబట్టారు. సోమవారం సరి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపై తిరగాల్సి వుండగా, ఆయన ఉద్దేశ్యపూర్వకంగా బేసి సంఖ్య ఉన్న వాహనంలో ప్రయాణించారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనకు అపరాధం విధించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'ఈ విధానం ఢిల్లీ ప్రభుత్వ గిమ్మిక్కు మాత్రమే. పంట వ్యర్థాల కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడిందని వారు అంటున్నారు. మరి సరి-బేసి విధానం అమలు చేస్తే ఏం లాభం?' అని ప్రశ్నించారు. 
 
మరోవైపు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రజల్లో కాలుష్యంపై అవగాహన కలిగించడం కోసం సైకిల్ తొక్కుతూ తన కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వం ఆదేశాలను పాటించకపోయినా.. వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని సరిబేసి విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments