Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లింది.. తొలి రోజే గ్యాంగ్ రేప్, ఆత్మహత్య చేసుకుంది

Webdunia
ఆదివారం, 1 మే 2022 (13:42 IST)
కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు.. తాను పనిలో చేరిన తొలి రోజే శవమై కనిపించింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. తొలి రోజు ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు తెల్లవారేసరికి ఆస్పత్రిలోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నావాలోని ఓ నర్సింగ్ హోంలో అదే ప్రాంతానికి చెందిన ఓ నర్సుకు ఉద్యోగం లభించింది. దీంతో శుక్రవారం కోటి ఆశలతో ఉద్యోగాని వెళ్ళింది. అయితే, మరుసటి రోజు తెల్లారేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఉన్నావో అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం