Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీమా హైదర్ కేసులో ట్విస్ట్ ... నకిలీ పత్రాలు ఇచ్చిన ఇద్దరి అరెస్టు

Webdunia
గురువారం, 27 జులై 2023 (13:49 IST)
పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ ప్రియుడి కోసం రెండు దేశాల సరిహద్దులను దాటి భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెకు నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులందర్‌కు చెందిన పుష్పేంద్ర, పవన్‌గా గుర్తించారు. వీరి నుంచి మొత్తం 15 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద గత మూడు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నకిలీ పత్రాల రాకెట్‌లో ఈ ఇద్దరికీ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
కరోనా సమయంలో పబ్ జీ ఆడుతున్నప్పుడు గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల సచిన్ మీనాతో తాను ప్రేమలో పడ్డానని 30 ఏళ్ల పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పటికే గులాం హైదర్ అనే వ్యక్తితో వివాహమై నలుగురు పిల్లలతో ఉన్న సీమా.. సచిన్‌తో కలిసి ఉండేందుకు పాకిస్థాన్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చింది. 
 
ఆమె తొలుత మార్చిలో నేపాల్ సచిన్‌ను పెళ్లి చేసుకుంది. మే 13న పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించింది. దేశంలోకి అక్రమంగా చొరబడినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్‌ను ఈనెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈమెన పాక్ గూఢచారి మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఆమె వద్ద మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments