Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతనాలు చెల్లించని ప్రైవేటు సంస్థలపై చర్యలొద్దు : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:27 IST)
లాక్డౌన్ సమయంలో వేతనాలు చెల్లించని సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సలహా ఇచ్చింది. 
 
లాక్డౌన్​ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్​ చేస్తూ.. పలు కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ ఎంఆర్​ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి శుక్రవారం తీర్పునిచ్చింది. 
 
ఈ సందర్భంగా ధర్మాసనం కొన్ని సూచనలు చేసింది. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సూచన చేసింది. యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య సయోధ్య కుదుర్చాలని రాష్ట్రాలను కోరింది. మార్చి 29న ఇచ్చిన ఆదేశాల చట్ట బద్ధతపై నాలుగు వారాల్లో అఫిడవిట్​ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 
లాక్డౌన్​ సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించలేని ప్రైవేటు సంస్థలపై జులై చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. వేతనాల సమస్యపై యాజమాన్యాలు, ఉద్యోగులు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది. దానికి సంబంధించిన పూర్తి నివేదికను లేబర్​ కమిషనర్లకు సమర్పించాలని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments