Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఏడు రాష్ట్రాలపై పగబట్టిన కరోనా వైరస్

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (12:20 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 
 
అయితే, దేశంలో కరోనా కేసులు నమోదవతున్న రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజుకు సగటున పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,535కి చేరగా ఒక్క మహారాష్ట్రలోనే 97,648 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చైనాను దాటేసిన మహారాష్ట్ర తాజాగా కెనడాను అధికమించింది.
 
ఆ రాష్ట్రంలో కరోనా వల్ల 3,590 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 38,716కు చేరగా 349 మంది చనిపోయారు. మూడోస్థానంలో ఉన్న ఢిల్లీలో కేసుల సంఖ్య 34,687, మరణాల సంఖ్య 1,085గా ఉన్నది. 
 
కాగా, కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో 84652 కేసులు నమోదు కాగా, 4645 మంది చనిపోయారు. అలాగే పొరుగుదేశమై పాకిస్థాన్‌లో 119536 కేసులు నమోదు కాగా, 2356 మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments