Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు
, గురువారం, 11 జూన్ 2020 (17:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 135 కేసులు నమోదవగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 38 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. 
 
ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 
 
ఏపీలో నమోదైన మొత్తం 4,261 పాజిటివ్ కేసులకు గాను 2,540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు మహమ్మారి బారిన పడుతున్నారు.
 
తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పోలీస్ శాఖ షాక్‌కు గురైంది. 
 
అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించి... అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. వారందరి శాంపిళ్లను సేకరించి, కరోనా టెస్టులు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రక్తదాత దినోత్సవం: రక్తదానంపై అవగాహన కల్పించడానికి షేర్‌చాట్ #PledgeToDonatecampaig