Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిది మంది బీఎస్ఎఫ్‌ జవాన్లకు కరోనా.. సీఐఎస్ఎఫ్ మృతి

Webdunia
మంగళవారం, 12 మే 2020 (18:35 IST)
బీఎస్ఎఫ్‌ జవాన్లు తొమ్మిది మందికి కరోనా సోకింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ నుంచి 6, త్రిపుర నుంచి 2 వరకు ఉండగా.. కోల్‌కతాలో మరో జవానుకు కొవిడ్-19 సోకినట్టు గుర్తించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం కోవిడ్-19 హెల్త్ కేర్ ఆస్పత్రులకు తరలించినట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అలాగే కరోనా అన్ని వర్గాల వారిపై విరుచుకుపడుతోంది. డిఫెన్స్‌లో కూడా పలువురికి సోకుతోంది. తాజాగా ఈ మహమ్మారి ధాటికి ఒక సీఐఎస్ఎఫ్ అధికారి మరణించారు. కరోనా సోకిన ఓ ఏఎస్ఐ కోల్‌కతాలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకూ సీఐఎస్ఎఫ్‌లో 68 మందికి కరోనా సోకగా.. ఇద్దరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 
 
కాగా, భారత్‌లో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 70,756కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 
 
గత 24 గంటల్లో మరో 87 మంది ప్రాణాలు కోల్పోవడంతో... దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 2,293కు చేరుకున్నాయి. కాగా ప్రస్తుతం 46,008 మంది కోవిడ్-19 బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... ఇప్పటి వరకు 22,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments