Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం మూడు రాత్రులు ముగిశాక పత్తాలేకుండా పారిపోయిన వరుడు..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (10:07 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ శోభనం మూడు రాత్రులు ముగిసిన తర్వాత పత్తాలేకుండా పారిపోయాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోటే తాలూకాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... జిల్లాలోని హొసకోటె తాలూకాలోని నందగుడి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి సీఆర్పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన అనూజా అనే యువతిని ఐదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో గతనెల 19న వీరు యలహంక సమీపంలోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అయ్యింది. ప్రమోద్‌ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్‌ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments