Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరోటాలు తింటూ భార్యతో మాట్లాడిన కొత్త పెళ్లికొడుకు మృతి

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (19:33 IST)
కొత్తగా పెళ్లైన దంపతులు ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తుండటం మామూలే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లు చేతిలో వుండటంతో ఎక్కడిపడితే అక్కడ ఫోనుల్లోనే కొత్త దంపతులు కాలం గడిపేస్తున్నారు. అలా తన భార్యతో మాట్లాడుతూ.. పరోటాలు తిన్న కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


వివరాల్లోకి వెళితే.. పుదుక్కోట్టై జిల్లా కరువక్కుడికి చెందిన పురుషోత్తమన్.. ఓ ప్రైవేట్ షోరూమ్‌లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఆరు నెలల క్రితం.. నెల్లైకి చెందిన షణ్ముగ సుందరితో వివాహం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం.. షణ్ముగ సుందరి తన పుట్టింటికి వెళ్లింది. దీంతో గురువారం రాత్రి ఓ షాపులో పరోటాలను కొని ఇంట్లో కూర్చుని తింటూ వున్న భర్తకు ఆమె ఫోన్ చేసింది.

ఫోన్ ఆన్ చేసి భార్యతో మాట్లాడుకుంటుండగా.. వేడి వేడిగా వున్న పరోటా ముక్కలు గొంతులో చిక్కుకున్నాయి. దీంతో గొంతులో మాటరాలేదు. వెంటనే భర్త మాట్లాడలేకపోతున్నాడనే సమాచారాన్ని షణ్ముగ సుందరి అతని బంధువులకు చెప్పింది. వారు అతని వద్దకు వెళ్లి చూసి షాకయ్యారు. 
 
పరోటా గొంతులో చిక్కుకుని పోరాడుతున్న ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న పురుషోత్తమన్‌ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే పురుషోత్తమన్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసి ఆతని భార్య షణ్ముగ సుందరి బోరున విలపించింది. దీంతో కొత్తగా పెళ్లైన పురుషోత్తమన్, షణ్ముగ సుందరి ఇళ్లల్లో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments