Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి భార్యతో ఉన్న భర్తను లాక్కెళ్ళిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎందుకు?

Webdunia
సోమవారం, 4 మే 2020 (21:16 IST)
కరోనాతో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు పెట్టుకున్న వారైతే చేసుకోలేక తెగ బాధపడిపోతున్నారు. పెళ్ళిళ్ళు పూర్తిగా క్యాన్సిల్స్ చేసేసుకున్నారు. కానీ మరికొంతమంది మాత్రం దొంగచాటుగా కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అలాంటి పెళ్ళే కర్ణాటకలో జరిగింది. కానీ పెళ్ళి తరువాత జరగాల్సిన శోభనం మాత్రం ఆగిపోయింది.
 
కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుత్యూరు ప్రాంతానికి చెందిన యువతికి, బోలాజిల్లాకు చెందిన యువకుడికి గత నెల 29న వివాహం జరిగింది. పదిమంది కుటుంబ సభ్యులతో ఎవరికీ అనుమానం రాకుండా పెళ్ళి చేసేసుకున్నారు. అయితే శోభనానికి మాత్రం మూడురోజులు ఆగాలని పండితుడు చెప్పడంతో ఆగారు. సరిగ్గా ఈ నెల 3వ తేదీ శోభనానికి అన్నీ సిద్థం చేసేసుకున్నారు.
 
విషయమంతా స్థానికులకు తెలిసింది. వరుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చాడని స్థానికులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులకు చెప్పేశారు. పోలీసులు కూడా సరిగ్గా సాయంత్రం సమయానికే వచ్చారు. అప్పుడే తన భార్యతో కలిసి గదిలోకి వెళ్ళాడు భర్త. అయితే ఇంతలో పోలీసులు తలుపులు కొట్టి బయటకు పిలిచారు.
 
పోలీసులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. మీరు పాజిటివ్ రోగులు ఎక్కువ ఉన్న ప్రాంతం రెడ్ జోన్ నుంచి వచ్చారు. మీరు క్వారైంటైన్లో 14 రోజులు ఉండాలి. మీతో పాటు మీరు పెళ్ళి చేసుకున్న భార్య, వాళ్ళ అమ్మా, నాన్నలు, పెళ్ళికి వచ్చిన వారందరూ ఉండాలని ముందుగా నూతన వధూవరులను తీసుకెళ్ళారట. శోభనం తరువాత వస్తానని బతిమాలినా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఒప్పుకోకుండా లాక్కెళ్ళారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments