Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ ఇవ్వలేదనీ కాల్పులు జరిపిన దుండగులు

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:20 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. అడిగితే సిగరెట్ ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బాధితుడు తప్పించుకోగా, కాల్పులు జరిపిన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌కు చెందిన అమిర్ ఖాన్ అనే యువకుడు తన మిత్రుడితో కలిసి గురువారం రాత్రి 9:30 సమయంలో ఓ షాపింగ్ మాల్ దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాడు. ఇంతలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అమిర్ ఖాన్‌‌ను సిగరెట్ అడిగారు. అందుకతడు నిరాకరించడంతో.. ఆ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. 
 
మాట్లాడుతుండగానే బైక్ మీద కూర్చున్న మరో వ్యక్తి తన పిస్టల్‌ తీసుకుని అమిర్ ఖాన్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం ఇద్దరూ అదే బైక్‌పై పరారయ్యారు. కాగా అమిర్ ఖాన్ ఛాతీలో ఓ బుల్లెట్ దిగింది. కానీ, అదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments