Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

ఠాగూర్
గురువారం, 1 మే 2025 (19:14 IST)
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్షకు (NEET UG 2025) సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్టీయే (NTA) చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై తప్పుదారిపట్టించే సమాచారాన్ని ఆన్‌లైన్ ప్రచారం చేస్తున్న దాదాపు 120కి పైగా సామాజిక మాధ్యమఖాతాల్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్టు సమాచారం. వీటిలో 106 టెలిగ్రామ్, 16 ఇన్‌స్టాగ్రామ్ చానళ్లు ఉన్నట్టు ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఛానళ్ళపై తదుపరి దర్యాప్తు కోసం కేసులను కేంద్ర హోం శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసినట్టు సమాచారం. 
 
అలాగే, అసత్య ప్రచారాన్ని, విద్యార్థుల్లో అనవసర భయాందోళనల్ని నివారించేందుకు ఈ చానళ్లను తొలగించాలని టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలను సైతం కోరినట్టు తెలుస్తోంది. నీట్ ప్రశ్నపత్రం గురించి తప్పుడు ప్రచారం చేసే అనధికార వెబ్‌సైట్/సోషల్ మీడియా ఖాతాలు, పరీక్ష కంటెంట్ యాక్సెస్‌కు సంబంధించి క్లెయిమ్ చేసే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎన్టీయే ఇటీవల కొత్త వేదికను ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 
ఈ పరీక్షకు సంబంధించి అనుమానాస్పద కంటెంట్ ప్రచారం చేసినట్టు గుర్తిస్తే పోర్టు చేయవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 1500కు పైగా ఫిర్యాదులు అండగా వీటిలో అధికభాగం టెలిగ్రామ్ చానల్‌ లింక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ యేడాది నీట్ యూజీ పరీక్ష ఈ నెల 4వ తేదీన జరుగనున్న విషయం తెల్సిందే. నీట్ అడ్మిట్ కార్డులను ఎన్టీయే బుధవారం విడుదల చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం