Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదు.. రాష్ట్రపతి

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:31 IST)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంచలన ప్రకటన చేశారు. నిర్భయ కేసులో రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ వారి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 
 
హైదరాబాద్‌లో దిశ కేసు నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చిన రోజే రాష్ట్రపతి.. నిర్భయ కేసు దోషులైన క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడం గమనార్హం. మైనర్లపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
 
కాగా 2012లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచార కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా.. ఈ దోషి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్ఛుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇందుకు సంబంధించిన ఫైలును కేంద్ర హోం శాఖకు పంపారు. పోక్సో చట్టం కింద దోషులుగా తేలినవారు క్షమాభిక్షకు అర్హులు కారని, పార్లమెంటు ఈ విధమైన పిటిషన్లను సమీక్షించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం