Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో అధికారం మాదే.. : అమిత షా జోస్యం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (13:54 IST)
రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పుదుచ్చేరిలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుందని కేంద్ర హో మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. రాజవంశం కారణంగా కాంగ్రెస్‌ పార్టీ పుదుచ్చేరిలోనే కాకుండా దేశవ్యాప్తంగా విచ్ఛిన్నమవుతోందన్నారు. 
 
ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతం కారైక్కాల్‌ జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని, తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు. 
 
పుదుచ్చేరి ప్రాంతం చాలా పవిత్రమైందని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి చాలా కాలం ఇక్కడ నివసరించారన్నారు. అలాగే శ్రీ అరబిందో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో పుదుచ్చేరికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పుదుచ్చేరిని దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 
 
కాగా, ఇటీవల పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెల్సిందే. ఆ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్‌తో పాటు.. డీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments