Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్సీపీ-కాంగ్రెస్ చెరో సగం సీట్లు

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:49 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై అవగాహన కుదిరింది. పొత్తులో భాగంగా ఎన్‌సీపీ, కాంగ్రెస్ చెరో 125 సీట్లలో పోటీ చేస్తాయని, తక్కిన 38 సీట్లలో భాగస్వామ్య పార్టీలు పోటీలో ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ తెలిపారు.
 
ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడానికి ముందు చవాన్ మీడియాతో మాట్లాడుతూ, సీట్ల పంపకాల ఫార్ములాపై వంచిత్ బహుజన్ అఘాడి (ప్రకాష్ అంబేడ్కర్), స్వాభిమాన్ షెట్కారి సంఘటన, సమాజ్‌వాదీ పార్టీలో చర్చలు సాగిస్తున్నట్టు చెప్పారు.

వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతుండటంపై మాట్లాడుతూ, ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గుండెకాయ వంటివని, అయితే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. దేశాన్ని ఏకపార్టీ పాలనలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు, మాజీ మంత్రులు బీజేపీలోకి, శివసేనలోకి చేరుతుండటం ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

అయితే, పిరికివాళ్లు మాత్రమే పార్టీని వీడుతున్నారని, వీరికి ప్రజలే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని తాజా వలసలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments